మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినపుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "మన రెండు వర్గాల వారిలో ఎవరి వర్గం మంచి స్థితిలో ఉంది మరియు ఎవరి సభ ఉత్తమమైనది?"[1]
సూరా సూరా మరియం ఆయత 73 తఫ్సీర్
[1] సత్యతిరస్కారులైన ఖురైషులు - పేద ముస్లింలు అయిన 'అమ్మార్, బిలాల్ 'సుహైబ్ (ర.'ది. 'అ.)లను మరియు వారి సమావేశ స్థలాలైన దారుష్షూరా' మరియు దారుల్-అ'ర్ఖమ్ లను - అబూ జహల్, న'దర్ బిన్ 'హారిస్, 'ఉత్బా, షైబా, వంటి ధనవంతుల మరియు వారి పెద్ద పెద్ద భవనాల మరియు వారు సమావేశాలు చేసే దారున్నద్వాలతో పోల్చి తమ భౌతిక ఉన్నత స్థాయికి గర్వించేవారు మరియు పునరుత్థానాన్ని తిరస్కరించేవారు. మనం జీవించేది ఈ భూలోక జీవితం మాత్రమేనని వాదులాడే వారు. కాని వారికి ముందున్నవారు, వారి కంటే ఎక్కువ సిరిసంపదలున్నా నాశనం చేయబడ్డారనే విషయాన్ని మరచిపోయే వారు. చూడండి, 19:74
సూరా సూరా మరియం ఆయత 73 తఫ్సీర్