వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణం లేనివారు[1]. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు.
సూరా సూరా నహల్ ఆయత 21 తఫ్సీర్
[1] ఈ 'మృతులు' అంటే కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, మరణించిన సాధులు మరియు వలీలు కూడా! తరువాత ప్రాణం లేని వారు అని మళ్ళీ నొక్కి చెప్పబడుతోంది. దీనితో దర్గాలను ఆరాధించే వారు చెప్పే మాటలు: 'మేము మృతులను కాదు ప్రార్థించేది, వారు తమ గోరీలలో సజీవులై ఉన్నారు' అనేది తప్పని విశదమౌతోంది. అంటే మరణించిన తరువాత వారికి ఈ లోకంతో ఎట్టి సంబంధం ఉండదు. వారు ఏమీ చేయలేరు. అయితే వారెలా మేలు గానీ, కీడు గానీ చేయగలరు? చూడండి, 7:191-194.
సూరా సూరా నహల్ ఆయత 21 తఫ్సీర్