మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము.[1] మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు.[2]
సూరా సూరా తూర్ ఆయత 21 తఫ్సీర్
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'మానవుడు మరణిస్తే అతని కర్మలు ఆగిపోతాయి. కాని మూడు విషయాల పుణ్యఫలితం మరణించిన తరువాత కూడా దొరుకుతూ ఉంటుంది. 1) సదఖహ్ జారియహ్, 2) అతడు వదిలిన జ్ఞానం - దేనితోనైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 3) సద్వర్తనులైన సంతానం - ఎవరైతే అతని కొరకు ప్రార్థిస్తూ ఉంటారో!' ('స.ముస్లిం).
[2] ఇటువంటి ఆయత్ కే చూడండి, 74:38.
సూరా సూరా తూర్ ఆయత 21 తఫ్సీర్